టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్..

101
CSK
- Advertisement -

ఐపీఎల్ 2021లో కీలకమైన హైవోల్టేజ్ మ్యాచ్ గురువారం షార్జా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. లీగ్‌లో టాప్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్నది. ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు టాస్ వేశారు. ఈ టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇది చిన్న గ్రౌండ్ అని, లక్ష్యఛేదన సమయంలో బౌలింగ్ చేయడం కొంచెం కష్టమేనని చెన్నై కెప్టెన్ ధోనీ వెల్లడించాడు. ఈ మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని తెలిపాడు.

అటు, బెంగళూరు సారథి కోహ్లీ స్పందిస్తూ, తాము టాస్ గెలిచినా మొదట బౌలింగే ఎంచుకునేవాళ్లమని అన్నాడు. ఇక సచిన్ బేబీ స్థానంలో నవదీప్ సైనీని తుదిజట్టులోకి తీసుకున్నామని కోహ్లీ వెల్లడించాడు. ఆల్ రౌండర్ కౌల్ జేమీసన్ స్థానంలో టిమ్ డేవిడ్ ఆడతాడని తెలిపాడు.

- Advertisement -