ఆర్సీబీని చిత్తుచేసిన చెన్నై…

226
rcb
- Advertisement -

ఐపీఎల్ 1వ సీజన్‌లో భాగంగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆర్సీబీని చిత్తుచేసింది చెన్నై. అటు బ్యాటింగ్‌…ఇటు బౌలింగ్‌లోనూ రాణించి సత్తాచాటింది. దీంతో 69 పరుగుల తేడాతో విజయం సాధించింది ధోని సేన.

192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించినా టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఓటమి ఖరారైంది. దీంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 122 పరుగులు మాత్రమే చేసింది. దేవదత్‌ పడిక్కల్‌(34: 15 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) , కోహ్లీ(8), గ్లెన్‌ మాక్స్‌వెల్‌(22), ఏబీ డివిలియర్స్‌(4) చేతులెత్తేశారు. చెన్నై బౌలర్లలో జడేజా(3/13), ఇమ్రాన్‌ తాహిర్‌(2/16) బెంగళూరును కుప్పకూల్చారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఆరంభంలో డుప్లెసిస్‌(50: 41 బంతుల్లో 5ఫోర్లు, సిక్స్‌), ఆఖర్లో రవీంద్ర జడేజా(62 నాటౌట్‌: 28 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) వీరవిహారం చేశాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన 20వ ఓవర్లో జడేజా వరుసగా 6 6 N(నోబాల్‌)6 6 2 6 4 బాదడంతో ఒకే ఓవర్లో 37 పరుగులు వచ్చాయి.

- Advertisement -