దానివల్లే సోషల్ మీడియాకు దూరం: ఛార్మి

393
charmi
- Advertisement -

హాట్ బ్యూటీ ఛార్మీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్న ఛార్మి ఇకపై ఆ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పినట్లు తెలిపింది.

కరోనాతో అంతా ఇబ్బంది పడుతున్నారు. మ‌న దేశ ప‌రిస్థితి అద్వాన్నంగా త‌యారైంది. అందుకే సోష‌ల్ మీడియాకు కొద్ది రోజులకు దూరంగా ఉండాల‌ని అనుకుంటున్నాను. మీరు మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండండి అంటూ చేతులెత్తి వేడుకుంది.

క‌రోనా విల‌య‌తాండవాన్ని చూడ‌లేక‌పోతున్నాను. ప‌రిస్థితి భ‌యంక‌రంగా మారుతుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తు వీట‌న్నింటిని చూసి త‌ట్టుకునే శ‌క్తి నాకు లేదు. అందుకే కొద్ది రోజుల పాటు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నానని చెప్పుకొచ్చింది.

- Advertisement -