రూ.200 కోట్ల క్లబ్‌లో రంగస్థలం..

255
Charan's Rangasthalam Joined 200 crores club
- Advertisement -

మెగాస్టార్ పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో సమంతా కథనాయిక నటించింది. ఈ సినిమా విడుదలై నిన్నటికి నెల రోజులు పూర్తి చేసుకుంది. విడుదలకు ముందు భారీ అంచనాలను ఏర్పరుచుకుని విడుదల తర్వాత కూడా అంచనాలకు ఎక్కడా తగ్గకుండా రికార్డులను తిరగ రాసింది. ఈ సినిమాపై ప్రశంసల వర్షం కరిస్తూనే ఉంది. ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్‌ ట్విట్టర్ ద్వారా చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.

Charan's Rangasthalam Joined 200 crores club

అయితే ఈ సినిమాకు సంబంధించిన వసూళ్ల పరంగా ఇప్పటి వరకూ రూ.200 కోట్ల మార్కును దాటినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా రూ.200 కోట్టు రాబట్టిందని అధికారింకగా తెలిపింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా రాబట్టని కలెక్షన్లను రంగస్థలం సినిమా రాబట్టి బాహుబలి తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక రామ్ చరణ్ కెరీర్‌లో భారీ కలెక్షన్లను సాధించిన ఇదే కావడం విశేషం.

- Advertisement -