నేను ఏ క్షణమైనా చనిపోవచ్చుః ఎమ్మెల్యే అక్బరుద్దీన్

294
Akbaruddin Owaisi
- Advertisement -

చాంద్రయణ్ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ క్షణమైనా చనిపోవచ్చని వైద్యులు చెప్పారన్నారు. కరీంనగర్ లో జరిగిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య కారణాలతో ఇటీవలనే లండన్ కు వెళ్లి చికిత్స చేయించుకొని అక్బరుద్దీన్ హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు.

నేను చనిపోతానన్న బాధ తనకు లేదని కానీ ఇటివలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి గెలవడం తనకు బాధ కలిగించిందన్నారు. కరీంనగర్ లో గతంలో ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తి డిప్యూటీ మేయర్ గా ఉండేవారని గుర్తు చేశారు. ఎంఐఎంకు ఓటు వేయకపోయినా పర్వాలేదు కానీ బీజేపీకి మాత్రం ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. కరీంగనర్ లో బీజేపీ ఎదగడం తనకు బాధగా ఉందన్నారు.

- Advertisement -