నితిన్‌-చంద్రశేఖర్‌ యేలేటి మూవీ ప్రారంభం..

526
nithin
- Advertisement -

విభిన్న‌మైన సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి. ప్రస్తుతం నితిన్ హీరోగా సినిమా చేస్తుండగా మూవీ ప్రారంభమైంది. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్రియా వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించింది. భ‌వ్య క్రియేష‌న్స్ ఆనంద ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా పూజా కార్యక్రమాల సందర్భంగా నిర్మాత సుధాకర రెడ్డి ఫస్ట్ క్లాప్ కొట్టారు. నితిన్ ప్రస్తుతం ‘ భీష్మ ‘ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌నమంతా మూవీ తర్వాత చంద్రశేఖర్ యేలేటీ నిర్మిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. క‌చ్చితంగా ఈ చిత్రంతో నితిన్ కూడా విజ‌యాన్ని అందుకుంటార‌ని న‌మ్ముతున్నారు అభిమానులు. వ‌ర‌స ఫ్లాపుల‌తో డీలా ప‌డిన నితిన్ కెరీర్‌కు ఈ చిత్రం కీల‌కంగా మారింది.

- Advertisement -