ఫినిష్ అవుతారు..జాగ్రత్త…చంద్రబాబు వార్నింగ్‌

380
chandrababu
- Advertisement -

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పర్యటనలో భాగంగా బీజేపీ కార్యకర్తలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. పబ్లిక్‌గానే మాతో పెట్టుకుంటే ఫినీష్ అవుతారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.

ఏపీలో అభివృద్ధి పనుల్లో అక్రమాలు, అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అఢ్డుకోవడంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాతో పెట్టుకుంటే ఫినిష్‌ అయిపోతారు. బయటకు వస్తే మిమ్మల్ని వదిలి పెట్టరు. మర్యాదగా ఉండు. చాలా సమస్యలు వస్తాయి అంటూ ఓ బీజేపీ మహిళా నేతను బహిరంగంగా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.

- Advertisement -