బీజేపీలోకి టీడీపీ ఎంపీలు..చంద్రబాబు స్పందన ఇది..!

448
tdp chandrababu
- Advertisement -

బీజేపీలో టీడీపీ రాజ్యసభ ఎంపీలు చేరడంపై తనదైనశైలీలో స్పందించారు మాజీ సీఎం,టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న చంద్రబాబు..ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ బీజేపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.

ఎంతమంది నాయకులు పార్టీని వీడినా, కార్యకర్తలు, ప్రజల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, సంక్షోభాలు టీడీపీకి కొత్తేమీ కాదన్నారు. క్లిష్ట సమయంలో ప్రజలు, కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటారని వారే తమ బలమన్నారు. పార్టీని వీడి వెళ్లిన వారికి వారి వ్యక్తిగత అజెండాలు ఉన్నాయని ఆరోపించారు. తాను ఎన్నడూ చేతులు ఎత్తివేయలేదన్నారు.

chandrababu twitter

- Advertisement -