జలవిహార్ లో హరికృష్ణ దశదిన కర్మ..

340
Chandrababu at Nandamuri Harikrishna 11th day ceremony
- Advertisement -

నేడు నందమూరి హరికృష్ణ దశదిన కర్మ. ఈ కార్యక్రమాన్న ఈరోజు హైదరాబాద్ లో ఉన్న జలవిహార్ లో నిర్వహించారు కుటుంబసభ్యులు. ఈ సంధర్బంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లను దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ చేతిలో చేయి వేసి చంద్రబాబు ముచ్చటిస్తుండటం అందరినీ ఆకట్టుకుంది.

Chandrababu at Nandamuri Harikrishna 11th day ceremonyఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్, నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి, హీరో నాగార్జున, ఎంపీలు మురళీమోహన్, రామ్మోహన్ నాయుడులతో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యి, హరికృష్ణ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే.

Chandrababu at Nandamuri Harikrishna 11th day ceremony

..

- Advertisement -