చక్కా జామ్‌..అత్యవసర సేవలకు మినహాయింపు

109
chakka jam
- Advertisement -

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి.ఇవాళ చక్కా జామ్ కు రైతు సంఘాలు పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులు మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు రాస్తారోకో జరగనుంది.

ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మినహా అన్ని రాష్ట్రాలలో చక్కా జామ్ కార్యక్రమం జరగనుండగా అంబులెన్స్, స్కూల్ బస్సు వంటి అత్యవసర అవసరమైన సేవలకు మినహాయింపునిచ్చారు.

చక్కా జామ్ పూర్తిగా శాంతియుతంగా అహింసాత్మకంగా ఉంటుందని తెలిపాయి రైతు సంఘాలు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, సాధారణ పౌరులతో ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని నిరసనకారులకు సూచించాయి. చక్కా జామ్ నేపథ్యంలో ఢిల్లీ బార్డర్ లో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేయగా ఘాజీపూర్, టిక్రి, సింఘు వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఢిల్లీ పోలీసులు.

- Advertisement -