బావ కోసం అక్కినేని బ్రదర్స్‌..!

239
- Advertisement -

అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన హీరో సుమంత్. సత్యం, గౌరీ లాంటి హిట్ సినిమాలు చేసినా.. స్టార్ ఇమేజ్ సాధించే స్థాయి భారీ సక్సెస్లు సాధించటంలో మాత్రం వెనకపడ్డాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సుమంత్ తాజాగా ఓ బాలీవుడ్ సినిమా రీమేక్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

సుమంత్‌ హీరోగా తెరకెక్కిన ‘నరుడా డోనరుడా’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ మూవీకి నవంబర్‌4న ఆడియో ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి అతిథులుగా అక్కినేని బ్రదర్స్‌ నాగ చైతన్య, అఖిల్‌ వస్తున్నట్లు టాక్‌ వినిపిస్తుంది.

హిందీలో సక్సెస్‌ అయిన ‘విక్కీ డోనార్‌’ రీమేక్‌గా ఇది తెరకెక్కగా, వరుస పరాజయాలతో వెనుకబడ్డ సుమంత్‌, ఈ మూవీతోనైనా ఫాంలోకి రావాలని చూస్తున్నాడు. ఇందులో సుమంత్‌ సరసన పల్లవి శుభాష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

online news portal

మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రీమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ పతాకాలపై వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. హీరోయిన్‌గా పల్లవి సుభాశ్, కీలక పాత్రలో తనికెళ్ల భరణి నటించారు.

ఇటీవలె విడుదలైన ‘నరుడా.. డోనరుడా’ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.టాలీవుడ్ సెలబ్రిటీలు సహా అభిమారులు సోషల్ మీడియాలో సరదాగా స్పందించారు. స్పెర్మ్ డోనర్‌ నిక్కర్ వేసుకుని చంటిపిల్లల మధ్యలో నిలబడి చేతిలో డబ్బుకు తదేకంగా చూస్తున్నట్టుగా ఫస్ట్ లుక్‌ పోస్టర్ లో సుమంత్ కనిపించాడు. మరో పోస్టర్ లో స్పెర్మ్ పై ఎక్కి మేఘాల్లో ప్రయాణిస్తున్నట్టుగా చూపించారు.

- Advertisement -