గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న చాడ కిషన్ రెడ్డి..

675
- Advertisement -

రాజ్యసభ సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రవేశపెట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఎడవెల్లి క్రిష్ణారెడ్డి (TRS పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరంగల్ జిల్లా) విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి స్వీకరించి ఈ రోజు వారి వ్యవసాయ క్షేత్రంలో మామిడి మొక్కలు నాటడం జరిగింది.

Chada Kishan Reddy

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ నేడు ఉద్యమంలా దిగ్విజయంగా సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించడం సంతోషించదగిన విషయం అని ఆయన అన్నారు..ఇప్పటి వరకు దాదాపు 4కోట్ల మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. నేడు అంతరించి పోతున్న పర్యావరణాన్ని రక్షించడం మన అందరి బాధ్యతగా స్వీకరించి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బండా నరేంద్రర్ రెడ్డి (జడ్పీ ఛైర్మన్ నల్గొండ)కి,ఎల్గనమోని అంజయ్య యాదవ్ (ఎమ్మెల్యే షాద్ నగర్)కి,ఎన్‌. జగదీశ్వర్ రెడ్డి (ఆర్‌డీఓ నల్గొండ)ని ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించాలని చాడ కిషన్ రెడ్డి వారిని కోరారు.

- Advertisement -