GHMC కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర బృందం..

182
Central Team
- Advertisement -

జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ భరొక నేతృత్వంలోని కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం మంగళవారం జీహెచ్‌ఎంసి ప్రదాన కార్యాలయంను సందర్శించింది. ముందుగా కోవిద్-19 కంట్రోల్ రూం పనితీరును తనిఖీ చేసింది. కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్న విధులు గురించి ఓ ఎస్ డి అనురాధ వివరించారు. దీనిపై కేంద్ర బృందం పలు అంశాలపై ప్రశ్నించి, అప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు ర్యాండంగా ఫోన్ చేయించి ద్రువీకరించు కున్నారు. వలస కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు గురించి, వారి నుండి కంట్రోల్ రూమ్ కు వస్తున్న కాల్స్ గురించి, అన్నపూర్ణ మొబైల్ కేంద్రాల ద్వారా ఏ విదంగా టై అప్ చేసి రెగ్యులర్‌గా భోజనం పెడుతున్నారు,ఏ ఏ శాఖలు, జిల్లాలతో సమన్వయము చేసుకుంటున్నారనే వివరాలు తెలుసు కున్నారు.

కరోనా నేపద్యంలో ఆహారం పంపిణీ చేసిన వారి వివరాలు, ఎంత మందికి ఆహారం అందింది అనే వివరాలు తెలుసుకున్నారు. మూడు షిఫ్టులలో 24/7 పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. అత్యవసర సేవలు అందించుటకు 32 అంబులెన్సు లను జోనల్ కమీషనర్ కార్యాలయాలలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విదేశాలనుండి వచ్చి ఇక్కడ హోటల్స్‌లో ఉంటున్న వారిని పర్యాటక అధికారి మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్ 040-2111 11 11 కు వచ్చిన ప్రతి కాల్ ను రిజిస్టర్‌లో నమోదుచేసి స్పందిస్తున్నట్లు తెలిపారు.

హెల్ప్ లైన్ కు ఏడు లైన్స్ ఉన్నట్లు తెలిపారు. అనుమానిత కేసులపై తదుపరి చర్యల నిమిత్తం సర్కిల్ కార్యాలయాలకు పంపుతున్నట్లు తెలిపారు. విదేశాలనుండి వచ్చిన వారు, హోం క్వారంటైన్‌లో ఉంచిన వారి ఆరోగ్య స్థితిపై ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కరోనా నేపద్యంలో మంత్రులు, జీహెచ్ యంసి చేపట్టిన కార్యక్రమాల విడియోలను కేంద్ర కమిటి సూచించింది. పారిశుద్య, ఎంటమాలజీ, డిఆర్ఎఫ్ వారి సేవలను అభినందిస్తు మంత్రి కేటిఆర్ వారితో భోజనం చేసిన వీడియోలను చూసి అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులు జిహెచ్ఎంసి కమాండ్ కాంట్రొల్ రూమ్‌ను సందర్శించి, ఆన్ లైన్ మానిటరింగ్ సిస్టంను పరిశీలించారు. కేసుల మానిటరింగ్ గురించి కమిటీకి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ వివరించారు.

- Advertisement -