కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వ చర్యలు భేష్‌:కేంద్ర బృందం

235
corona telangana
- Advertisement -

కరోనా కట్టడి లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలను అభినందించింది కేంద్ర బృందం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోమ్ ఐసోలేషన్ పేషేంట్ ల కోసం రూపొందించిన హితం యాప్ ను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా ఉంది.

రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం కరోనా కట్టడి కి సంబంధించిన అనేక అంశాలపై చర్చించింది.రాష్ట్ర పర్యటన లో భాగంగా వైద్యారోగ్యా శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో బిఆర్కే భవన్ లో సమావేశం అయింది.ఇన్నోవేటివ్ హితం యాప్ ఇతర రాష్ట్రల తో పంచుకోవాల్సిందిగా సూచించిన కేంద్ర బృందం,నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్

కరోనా మహమ్మరిని అదుపు చేయడానికి కోవిడ్ 19 టెస్ట్ ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా తీవ్రతను తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పట్టాల్సిన పలు అంశాలపై చర్చించారు వీకే పాల్.

రాష్ట్రంలోని ఆసుపత్రిలలో కరోనా చికిత్సకు సిద్ధమైన విధానము వ్యాప్తిని అరికట్టే చర్యలు పేషేంట్ లకు అందిస్తున్న చికిత్స చర్యలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు వీకే పాల్. మొదటి నుండి కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం సమన్వయం తో పని చేస్తున్నాము…ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ప్రజల ప్రాణాలు రక్షించండానికి 24 గంటల పాటు శ్రమిస్తున్నాము.

కేంద్ర బృందం కరోనా పరీక్షలు, చికిత్స లపై సంతృప్తి వ్యక్తం చేసింది.కేంద్ర బృందం గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ నివారణ చర్యల పై సూచనలు చేసింది.ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మాద్యే జరిగింది క్యాబినెట్ సమావేశంలో రోజుకు 40 వేల పరిక్షలు నిర్వహించాలని ఆదేశించారు.కోవిడ్ కట్టడి కి ప్రత్యేక నిధులు మంజూరు చేశారని సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశంలో కేంద్ర బృందానికి తెలిపారు.

- Advertisement -