బిగ్‏బాస్‏ని రైతులతో నిర్వహించండి…!

265
CBI Ex JD Lakshmi Narayana
- Advertisement -

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ బిగ్ బాస్ పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీనారాయణ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నేడు కాకినాడలో నిర్వహించిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ రియాల్టీ షోను సెలబ్రిటీలతో కాకుండా రైతులతో నిర్వహించాలని అన్నారు. అప్పుడే రైతుల ఆవేదన అర్థం అవుతుందని పేర్కొన్నారు.

bigg-boss-2-telugu-contestants

ప్రజాస్వామ్యంపై ప్రజలు దృష్టి పెట్టాలని.. రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సూచించారు. సామాజిక వర్గం కన్నా.. సమాజమే ముఖ్యమని చెప్పారు. సీఎం చంద్రబాబుతో సమావేశానికి సమయం కుదిరనప్పుడు జిల్లాలో తాను గుర్తించిన సమస్యలను ఆయనకు తెలియజేస్తానని చెప్పారు.

ఈ ప్రాంతంలో ఓఎన్జీస్ వలన ప్రజలు ఇబ్బందులపై ఓ నివేదిక చేసి సీఎం చంద్రబాబుకి అందజేస్తానని, అలాగే కొబ్బరి, మత్య్సకారుల రైతుల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బిగ్ బాస్ చూస్తూ.. యువత ప్రతి రోజు 2 గంటల సమయం వృద్ధా చేస్తున్నారని గతవారం బిగ్ బాస్ పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -