‘బిగ్ బాస్’పై కేసు పెట్టిన గాయత్రి గుప్తా..

324
Gayathri Gupta
- Advertisement -

బిగ్‌బాస్‌-3 రియాలిటీ షోపై కేసు నమోదయింది.మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ‘బిగ్ బాస్’ షో నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాజాగా నటి గాయత్రి గుప్తా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిగ్‌బాస్ షోకి తాను సెలక్టయ్యానని చెప్పారు. బిగ్ బాస్3లో నటించేందుకు సిద్ధమా అని రఘు అడిగారని, 100 రోజులు బిగ్ బాస్‌లో ఉండాల్సి వస్తుందని.. కుటుంబానికి అన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పారని గాయత్రి గుప్తా వెల్లడించింది.

Big Boss 3

ముంబై నుంచి అభిషేక్‌తో పాటు రఘు, రవికాంత్ తన ఇంటికి వచ్చి అగ్రిమెంట్స్‌పై సంతకాలు చేయించుకున్నారని గాయత్రి గుప్తా తెలిపింది. బిగ్ బాస్3కి సెలెక్ట్ అయ్యారు కాబట్టి వేరే ఏ ప్రాజెక్ట్స్‌ని ఒప్పుకోవద్దన్నారని చెప్పింది. దీంతో ఆరు సినిమాల్లో నటించే అవకాశాన్ని వదులుకున్నానని గాయత్రి తెలిపింది.

అయితే బిగ్‌బాస్‌లోకి వెళ్లాలంటే పైవారిని ఎలా సంతృప్తి పరుస్తారని రఘు అడిగారని, అలా ఎందుకని తాను ఘాటుగా ప్రశ్నించానని గాయత్రి తెలిపింది. ఆ తర్వాత ఒకరోజు తనకు ఫోన్ చేసి బిగ్‌బాస్ షోకి ఎంపిక కాలేదని చెప్పారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ నష్టపరిహారం ఇవ్వాల్సింగా షో నిర్వాహకులను అడిగానని, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే పోలీసులను ఆశ్రయించానని గాయత్రి తెలిపింది. ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లుతుందో చూడాలి మరి..

- Advertisement -