యాంకర్‌ ప్రశాంతిపై కేసు నమోదు..

629
Anchor Prasanthi
- Advertisement -

ఉప్పల్‌లో తెలుగు టీవీ యాంకర్ రచ్చ రచ్చ చేసింది. ఉప్పల్ స్టేడియంలో నిన్న జరిగిన హైదరాబాద్-కోల్ కతా మ్యాచ్ సందర్భంగా యాంకర్ ప్రశాంతి వీరంగం సృష్టించింది. తన స్నేహితులు ప్రియ, పూర్ణిమ, శ్రీకాంత్ రెడ్డి, సురేశ్, వేణుగోపాల్‌లతో కలసి మ్యాచ్ చూసేందుకు ఆమె వచ్చింది. ఈ సందర్భంగా తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగేలా వారు ప్రవర్తించారు.

అయితే ప్రశాంతి వీరంగం చూసిన వ్యక్తి అనంతరం ఆమెపై – ఆమె సహకరించిన ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాదితుడు. తనను మ్యాచ్ చూడకుండా నానా రకాలుగా హింసాచారని హేళన చేశారని – తోసేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ప్రశాంతితో పాటు మిగతా ఐదుగురిపై ఐపీసీ 341 -188 – 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీని పై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Anchor Prasanthi

- Advertisement -