గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కేర్ హాస్పిటల్స్ వైద్యులు..

99
Care hospital doctors
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ముషీరాబాద్ కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా.సూర్యప్రకాష్ మాట్లాడుతూ.. మానవ మనుగడకు మొక్కలు ఎంతో అవసరం అని అన్నారు. ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటుతు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ సిఐ జహంగీర్ యాదవ్,హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -