ఆ తిలకం మర్చిపోలేను… ఫడ్నవీప్ ఉద్వేగం

43
- Advertisement -

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ దీపస్తంభ్ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జలగావ్ ప్రాంతలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ యువతి తిలకం దిద్దారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశంతో ఆయన కళ్లు చెమర్చాయి. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

Also Read: ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్..

ఇప్పటి వరకు ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. తిలకం స్వీకరించాను. ఇప్పుడు కఊడా నాకు తిలకం దిద్దేందుకు ఓసోదరి బొటనివేలు నా నుదిటి మీదకు చేరింది. అయితే అది చేతి బొటనవేలు కాదు కాలి బొటనవేలు. జీవితంలో ఒక్కసారిగా ఇలాంటి క్షణాల్లో ఉద్వేగానికి గురిచేసింది. కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఈ సోదరి నాకు తిలకం దిద్దింది. అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె మోఖంలో చిరునవ్వు, కళ్లలో ఒకరకమైన మెరుపు వచ్చింది. నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా.. నాకు ఎవరి జాలి, దయ అవసరం లేదు. ఆపరిస్థితులను దాటుకొని వెళ్తాను అని ఆ మెరుపును చూస్తే నాకు అనిపించిందని పేర్కొన్నారు. అలాగే అమె కోసం ప్రతిపోరాటంలో అండగా ఉంటానాని భరోసా ఇస్తున్నాని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

Also Read: మార్నింగ్‌ వాక్‌తో ఆరోగ్యం

- Advertisement -