ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం..

36
- Advertisement -

ఉత్తరాఖండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతిచెందారు. ఉత్తరకాశి జిల్లాలో యమునోత్రి జాతీయ రహదారిపై దమ్టా వద్ద ఈ ప్రమాదం జరిగింది. మధ్య ప్రదేశ్‌లోని పన్నా జిల్లా నుంచి 40 మంది భక్తులతో కూడిన బస్సు యమునోత్రి వెళ్తుండగా లోయలో పడిపోయింది.

ప్రమాద సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారుజ గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబలకు రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. గాయపడ్డవారికి యాభై వేల రూపాయల సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -