Allu Arjun:పోసానికి బన్నీ ఫ్యాన్స్ ఫిదా

14
- Advertisement -

‘పోసాని కృష్ణమురళి’ని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన దగ్గర నుంచి ఆయన చాలా యాక్టివ్ అయిపోయారు. ముఖ్యంగా కళాకారులందరికీ ఉపయోగ పడేలా పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. త్వరలోనే ఏపీలో ఉన్న కళాకారులందరికీ ఐడెంటిటీ కార్డులు ఇస్తామని పోసాని కృష్ణమురళి తెలిపారు. మరోవైపు నంది నాటకోత్సవాల కోసం దరఖాస్తులు ఆహ్వానించామన్నారు. నాటకాలకు 115, ఉత్తమ పుస్తకాల క్యాటగిరీలో 3 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

సెప్టెంబర్ 7 నుంచి 18వ తేదీ వరకు స్క్రూటినీ జరుగుతుందన్నారు. 19వ తేదీ వరకు అవార్డులు ప్రకటన చేస్తామని ‘పోసాని కృష్ణమురళి’ చెప్పుకొచ్చారు. మరోవైపు అల్లు అర్జున్‌ గురించి కూడా పోసాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ పోసాని ఏం మాట్లాడాడు అంటే.. ‘అల్లు అర్జున్ నాకు మంచి మిత్రుడు. నాకు ఓసారి బన్నీ ఫోన్ చేసి.. మా ఇంటికొస్తారా.. టీ తాగి వెళ్దురుగానీ అన్నారు. నేను వెంటనే వెళ్లాను.. టీ ఇస్తే తాగుతున్నా.. అంతలో బన్నీ లోపల నుంచి ఒక ఎనవలప్ కవర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. చూస్తే.. బన్నీ ఎదురుగా నవ్వుతూ కనిపించాడు.

Also Read:షర్మిల చివరి ప్రయత్నం..ఫలిస్తుందా?

‘ఏంటి బాబూ ఇదీ అంటే.. తీసి చూడండి అన్నాడు. తీసి చూస్తే రూ.5 లక్షల చెక్ ఉంది. ఏంటి బాబూ నాకు చెక్ ఇచ్చావ్ అని అడిగాను. ఉంచండి మీ దగ్గర. మీరు మంచి పనికే డబ్బు ఉపయోగిస్తారు. మంచి పనికి ఉపయోగించండి అని బన్నీ కోరాడు. నేను కూడా ఆ డబ్బును ఆర్థిక సమస్యలతో చదువు ఆపేసిన ముగ్గురు విద్యార్థులకు పంచాను’ అని అల్లు అర్జున్‌తో తనకున్న అనుభవాలను గుర్తుచేసుకున్నారు. మరోవైపు బన్నీ చేసిన సాయానికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. పనిలో పనిగా పోసానికి కూడా బన్నీ ఫ్యాన్స్ ఫిదా అయ్యాం అంటున్నారు.

Also Read:సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ‘మ్యాడ్’

- Advertisement -