రంజాన్‌ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ..

229
- Advertisement -

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ జియో నుంచి ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకోవడానికి సరికొత్త ఆఫర్స్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు రంజాన్ పర్వదినం సందర్భంగా తన కస్టమర్లకు ఈద్ ముబారక్ ఎస్టీవీ 786’ పేరుతో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ఆఫర్ తీసుకొచ్చింది.

ఈ ఆఫర్ కింద రూ. 786తో రీచార్జ్ చేసుకుంటే, 150 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, రోజుకు వంద ఉచిత ఎస్సెమ్మెస్‌లను పంపుకోవచ్చు. అలాగే రోజుకు 2జీబీ ఇంటర్నెట్ డేటా వస్తుంది. 4జీతోపాటు 2జీ, 3జీల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు.

BSNL

ఢిల్లీ, ముంబై టెలికం సర్కిళ్లలోనూ ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తామని పేర్కొంది. ఈనెల 26లోగా చేసుకునే రీచార్జ్ లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఇటీవల ఫుట్ బాల్ ప్రియుల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సౌకర్యం లేకుండా రోజుకు 4 జీబీ డేటాను ఇస్తూ ఓ ఎస్టీవీని సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

తమ ఆకర్షణీయమైన ప్యాక్ ల కారణంగా ఇతర టెలికం నెట్ వర్క్ ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల మంది ఎంఎన్పీ తీసుకుని ఇతర నెట్ వర్క్ ల నుంచి వచ్చారని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

- Advertisement -