మొక్కలు నాటిన ఎంపీ వద్దిరాజు…

8
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌చే స్థాపించబడిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 17కోట్ల మొక్కల్ని నాటించి వాటిని పరిరక్షిస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌కు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టిన రోజు సందర్భంగా బంజారాహిల్స్‌ కేబీఆర్ పార్కులో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్ మొక్కల్ని నాటే, నాటించే, వాటిని పరిరక్షించడాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోతున్నారని వివరించారు. పర్యావరణ సమతుల్యాన్ని, ప్రకృతిని పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మానవాళిని పట్టి పీడిస్తున్న భూతాపాన్ని, వాతావరణ కాలుష్యాన్ని పారదోలేందుకు పెద్ద ఎత్తున మొక్కల్ని నాటడం, నాటించడం, వాటిని పరిరక్షించడం అత్యవసరం అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజుతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, కాపునాడు జాతీయ అధ్యక్షులు తాడివాక రమేష్ నాయుడు, మున్నూరు కాపు ప్రముఖులు కొండా దేవయ్య, సర్థార్ పుట్టం పురుషోత్తంరావు, ఆవుల రామారావు, ఉరుమడ్ల నర్సింహా, ఊసా రఘు, గుండ్లపల్లి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు వాకర్స్ అసోసియేషన్ ప్రముఖులు, అటవీ శాఖ సిబ్బంది ఎంపీ రవిచంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

వివేకా కేసు బిగ్ ట్విస్ట్.. నెక్స్ట్ జగనే !

ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభోత్సవం..

కొండగట్టుకు పవన్‌..

- Advertisement -