ఎమర్జెన్సీని తలపిస్తున్న ప్రజాపాలన..!

18
- Advertisement -

ప్రజాపాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. నిరుద్యోగుల సమస్యలపై విద్యార్థులు ధర్నా చేస్తుంటే.. చిత్రీకరించడానికి వెళ్ళిన జర్నలిస్టులను తిడుతూ, లాక్కుని వెళ్ళి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తోందని మండిపడ్డారు.

ఛానళ్ళు ఉన్నాయి కదా అని లోఫర్ గాళ్ళు వార్తలు రాస్తే, పండబెట్టి తొక్కి నార తీస్తానని” మీడియా ముఖంగా జర్నలిస్టులను బూతులు తిట్టిన రేవంత్ రెడ్డి.. నేడు అధికారం వచ్చేసరికి అహంకారంతో అదే పాటిస్తున్నాడని ఆరోపించారు.ఇదేనా ప్రజా పాలన అంటే?..ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?,జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కార్ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.

Also Read:Miss AI:మిస్‌ ఏఐగా కెంజాలేలి

- Advertisement -