BRS:కాళేశ్వరంకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

16
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే వారంతా ప్రత్యేక బస్సులో భారీ ర్యాలీగా బయలుదేరనున్నారు.

మొదట LMD రిజర్వాయర్‌ సందర్శించి రాత్రి రామగుండంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్‌ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు.అనంతరం బీఆర్‌ఎస్‌ బృందం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలను ఎండగట్టనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. భారీ వర్షాలతో మేడిగడ్డ నిండుకుని వాటర్ నిలుస్తుండటంతో ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేసి వాస్తవాలను వివరించనున్నారు.

Also Read:నందినగర్‌లో కేటీఆర్ బర్త్ డే వేడుకలు

- Advertisement -