బీఆర్ఎస్ మేనిఫెస్టో…కంప్లీట్ డీటైల్స్

55
- Advertisement -

తెలంగాణ ఏర్పడ్డనాడు అలుముకున్న పరిస్థితులను క్షుణ్ణంగా అర్ధంచేసుకున్న తర్వాత గొప్ప అధ్యయనం చేసిన తర్వాత మంచి పాలసీలు రూపొందించుకున్నం అన్నారు సీఎం కేసీఆర్. వెనుకబడేయబడ్డ తెలంగాణ బాగుపడాలంటే సంపద పెంచాలె – ప్రజలకు పంచాలె అని నిర్ణయించుకున్నం అన్నారు.

• బెస్ట్ ఎకనమిక్ పాలసీ
• బెస్ట్ పవర్ పాలసీ
• బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ
• బెస్ట్ ఇరిగేషన్ పాలసీ
• బెస్ట్ అగ్రికల్చర్ పాలసీ
• బెస్ట్ దళిత్ పాలసీ
• బెస్ట్ వెల్ఫేర్ పాలసీ
• బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ
• బెస్ట్ హెల్త్ పాలసీ
• బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ
• బెస్ట్ హౌసింగ్ పాలసీ
విజయవంతంగా అమలవుతున్న ఈ పాలసీలన్నీ యధావిధిగా కొనసాగిస్తం. కాలానుగుణంగా ఉద్దీపనలిస్తూ, ఉన్నతీకరించుకుంటం.
ఈరోజు బీఆర్ఎస్ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కొన్ని కొత్త హామీలు ప్రకటిస్తున్నం.
అందరికీ సన్నబియ్యం :
• తెలంగాణ రాంగనే రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించవద్దని రేషన్ బియ్యం కోటాను పెంచుకున్నం. పేదలు సంతోషపడ్డరు.
• బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నాం.
కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా :
• రాష్ట్రంలో తెల్లకార్డు కలిగిఉన్న ప్రతి పేద ఇంటికి రైతుబీమా తరహాలోనే ఎల్ఐసీ ద్వారా 5 లక్షల రూపాయల జీవితబీమా కల్పిస్తాం.
• వందశాతం ప్రీమియం ప్రభుత్వం ద్వారానే చెల్లిస్తాం.
• తద్వారా పేదలకు ఎనలేని మేలు చేయడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ బలోపేతానికి దోహదపడతాం.

Also Read:CM KCR:బీ- ఫామ్ అందుకున్న అభ్యర్థులు వీరే

ఆసరా పెన్షన్ల పెంపు :
• విధివంచితులైన అన్నార్తులను, దీనార్తులను, అసహాయులను ఆదుకోవడం సామాజిక బాధ్యత.
• అమెరికా, బ్రిటన్ వంటి అగ్ర దేశాల్లోనూ సోషల్ సెక్యూరిటీ పెన్షన్లు ఇస్తరు.
• భారతదేశంలో పేదలకిచ్చే పెన్షన్లు ఒక జోక్ లాగా ఉండె. ఎడమ చేత్తోటి విదిలించినట్లు నామమాత్రంగ 20 – 70 రూపాయలు ఇచ్చేది. గరిష్టంగా 200 ఇచ్చిన్రు.
• అవి కూటికి రాకపోవు, గుడ్డకు రాకపోవు.
• పేదల పట్ల గౌరవంతో పింఛన్లను వేల రూపాయలకు తీసుకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వమే.
• ఇవాళ నేను రాష్ట్రంలోని ఆసరా పెన్షన్ల లబ్దిదారులందరికీ ఒక తీపికబురు చెబుతున్నా…
• బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం.
• ఆసరా పెన్షన్లను ఐదేండ్లలో 5 వేల రూపాయలకు తీసుకపోతమని హామీ ఇస్తున్నా.
• ఇపుడు మనం ఇచ్చుకుంటన్నది– 2,016 రూపాయలు
• మొదటి సంవత్సరం వెయ్యి పెంచుతం – అంటే 3,016 రూపాయలకు పెంచుకుంటం.
• ఐదు సంవత్సరాలల్ల 5 వేల రూపాయలకు పెంచుతమని హామీ ఇస్తున్న.
• దివ్యాంగుల పెన్షన్ ఈ మధ్యనే 4,016 రూపాయలకు పెంచినం.
• రాబోయే ఐదేళ్లల్ల 6,016 రూపాయలకు పెంచుతమని హామీ ఇస్తున్నాం.
• దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద భారం ఒకేసారి పడదు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత, బాధ్యతతోని మా ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీలిస్తున్నాం.

రైతుబంధు సాయం పెంపు :
• దేశంల రైతులకు పంట పెట్టుబడికి ప్రభుత్వం సాయం చేయాలనే ఆలోచన ఎవ్వరు చేయలేదు.
• రైతుబంధు సృష్టికర్తనే బీఆర్ఎస్
• ఈ పథకం ఎన్నికల వాగ్దానం కాదు – మ్యానిఫెస్టోలో పెట్టింది కాదు.
• రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేసి, వ్యవసాయాన్ని స్థిరీకరించాలెనని ఆలోచించి, నిబద్ధతతో, నిజాయితీతో రైతుబంధు పథకం తెచ్చినం.
• కనుక, పెట్టింది మేమే – పెంచేది మేమే
• ఇప్పుడు రైతుబంధు కింద ఇస్తున్న పంట పెట్టుబడి సాయం – ఎకరానికి ఏటా 10,000 రూపాయలు
• బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే రైతుబంధు సాయాన్ని మొదటి సంవత్సరం ఎకరానికి ఏటా 12,000 రూపాయలకు పెంచుతుందని హామీ ఇస్తున్న.
• వచ్చే ఐదేండ్లలో రైతుబంధు సహాయాన్ని క్రమంగా పెంచుతూ.. గరిష్టంగా ఎకరానికి ఏటా 15,000 రూపాయలకు పెంచుతం అని హామీ ఇస్తున్నాం.
• ధాన్యం కొనుగోలు పాలసీని యధావిధిగా కొనసాగిస్తాం.
అర్హులైన మహిళలకు నెలకు 3 వేల భృతి :
• బీఆర్ఎస్ మొదటినుంచీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది.
• చాలా పథకాల ప్రయోజనాలు మహిళల పేర్లమీదనే అందిస్తున్నది.
• ఇవాళ మానవీయమైన మరో మంచి పథకాన్ని హామీ ఇస్తున్నాం.
• బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలందరికీ ప్రతినెలా 3,000 రూపాయల జీవన భృతిని అందిస్తుందని హామీ ఇస్తున్నాం.

400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం :
• కేంద్రంలో ఉన్న బీజేపీ గ్యాస్ సిలిండర్ ధరలను విపరీతంగా పెంచి, సామాన్యుల మీద మోయలేని భారం వేస్తున్నది.
• ఈ భారం తప్పించాలని మహిళల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో బీఆర్ఎస్ మానవీయ కోణంతో మరో హామీని ప్రకటిస్తున్నది.
• బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే అర్హులైన పేద మహిళలకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండరును అందిస్తుందని, మిగతా భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇస్తున్నాం.

ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంపు :
• బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నది.
• బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అత్యధికశాతం ప్రజలకు మునుపటికన్నా ఎక్కువ స్థాయిలో మెరుగైన ఆరోగ్య సేవలందిస్తున్నది.
• ఇపుడు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 5 లక్షలుగా ఉంది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ పరిమితిని 15 లక్షలకు పెంచుతుందని హామీ ఇస్తున్నాం.

పేదలకు ఇండ్ల స్థలాలు :
• రాష్ట్రంలో ఇంటి జాగ లేని నిరుపేదలకు బీఆర్ఎస్ ఇండ్ల స్థలాలు సమకూరుస్తుందని హామీ ఇస్తున్నాం.
• ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ పాలసీ చక్కగా ఉంది కనుక దాన్ని అలాగే కొనసాగిస్తాం.
అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు :
• తెలంగాణ ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యకు పెద్దపీట వేస్తున్నది. ఈ విధానం సత్ఫలితాలను సాధిస్తున్నది.
• రాబోయే రోజుల్లో మరిన్ని రెసిడెన్షియల్ విద్యాలయాలను నూతనంగా ఏర్పాటు చేస్తాం.
• అగ్రవర్ణ పేదల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం.
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు :
• రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సమాఖ్యలన్నింటికీ సొంత భవనాలు నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాం.

ఉద్యోగుల సీ.పీ.ఎస్.పై అధ్యయన కమిటీ :
• సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు తమకు పూర్వమున్న పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కోరుతున్నారు. దీనిపై అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తాం – నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.

•అనాథలైన పిల్లల కోసం ప్రత్యేక పాలసీ

Also Read:క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు..!

- Advertisement -