డీఎంకే బాటలో బీఆర్ఎస్..బలోపేతంపై దృష్టి

2
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు గులాబీ బాస్ , మాజీ సీఎం కేసీఆర్. పార్టీని బలోపేతనం కోసం డీఎంకే బాటలో బీఆర్ఎస్ పయనించనుంది.కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం సెప్టెంబర్లో చెన్నై పర్యటించనుంది. బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.

ఇందుకోసం అనుసరించాల్సిన మార్గాలను అన్వేషిస్తోంది.. దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల పనితీరును నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నిర్మాణం, పనితీరుపై బీఆర్ఎస్ దృష్టి సారించింది.తమిళనాడుకు చెందిన డీఎంకే తరహాలోనే తమది కూడా ఉద్యమ పార్టీ కావడంతో రెండు పార్టీల నడుమ అనేక సిద్దాంతపరమైన పోలికలు ఉన్నట్లు బీఆర్ఎస్ భావిస్తోంది.

సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే ఆటుపోట్లను ఎలా అధిగమించిందనే అంశాన్ని అధ్యయనం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనికోసం కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం సెప్టెంబర్లో చెన్నైలో పర్యటించనుంది. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డీఎంకే సంస్థాగత నిర్మాణంతో పాటు ఇతర అంశాలను వారం రోజుల పాటు ఈ బృందం అధ్యయనం చేయనుంది.ఈ నేపథ్యంలో పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో ఆంజనేయ గౌడ్, తుంగ బాలు వంటి యువ నేతలు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:శ్రీలంక మంత్రితో కేటిఆర్ సమావేశం

 

- Advertisement -