దేశానికే మార్గం చూపిన తెలంగాణ వ్యవసాయ విధానం..

245
niranjan reddy
- Advertisement -

తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికే మార్గం చూపిందని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలకు నూతనంగా విధులు స్వీకరించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ శ్రీ గెరత్ విన్ ఓవెన్.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం వర్ధిళ్లుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఎనిమిదేళ్లలో తెలంగాణ వ్యవసాయ రంగం స్వరూపం మారిందని…రూ.3.75 లక్షల కోట్లు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బలోపేతానికి ఖర్చు చేశాం అన్నారు. రైతుబంధు, రైతుభీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, సాగునీటి సదుపాయంతో రైతులు వ్యవసాయం పట్ల మక్కువ చూపుతున్నారన్నారు.

గత ఎనిమిదేళ్లలో నూతనంగా 80 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయని…దేశంలో అత్యధిక పంటలు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయాలు తెలుసుకుని అభినందించారు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్.

- Advertisement -