క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏడేళ్లు.. సచిన్‌ ఆసక్తికర వీడియో..

300
Sachin
- Advertisement -

టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్‌ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి సోమవారంతో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013, నవంబర్ 16న ఆయన క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు లారా, క్రిస్‌ గేల్‌ తనకి గతంలో ఇచ్చిన డ్రమ్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు సచిన్‌.

తాను క్రికెట్ కి గుడ్ బై చెబుతోన్న సందర్భంగా వెస్టిండీస్ క్రికెట్, లారా, క్రిస్ గేల్ కలసి ఆ డ్రమ్‌ను తనకు ఇచ్చారని సచిన్ ట్విట్టర్‌లో తెలిపారు. ఇటువంటి మంచి గిఫ్ట్ ఇచ్చిన వెస్టిండీస్‌ క్రికెట్‌ పట్ల తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని చెప్పారు. వారి ప్రేమ, గౌరవాలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.

ఓ సారి తన ఇంటికి వచ్చిన లారా ఆ డ్రమ్‌ను వాయించడం తనకు గుర్తుందని, అదో అద్భుత అనుభవమని అన్నారు. ప్రస్తుతం తాను కూడా వాయించడానికి కాస్త ప్రయత్నిస్తున్నానని, అయితే, ఆ స్థాయిలో మాత్రం సౌండ్ రావట్లేదని సచిన్ అన్నారు.

- Advertisement -