బ్రేకింగ్‌.. వేణు మాధవ్ మృతి..

568
venumadhavdeath
- Advertisement -

ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. దీంతో.. పాటుగా కిడ్నీ సమస్య కూడా ఉంది. లివర్, కిడ్నీ సమస్య తీవ్రం కావడంతో ఆయనను మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ రోజు చికిత్స పొందుతూ మృతి చెందారు.

venu

వేణుమాధవ్ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన జన్మించారు. వేణుమాధవ్ భార్య శ్రీవాణి, ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయనకు కళారంగం అంటే ఎంతో ఇష్టం ఉండేది. నాలుగో ఏట నుంచే ఆయన మిమిక్రీ చేయడం ప్రారంభించారు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన.. సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. లక్ష్మీ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు. సినిమాలతో పాటు పలు టీవీ ప్రోగ్రాములు కూడా చేశారు.

మాస్టర్, తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు సినిమాలతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. హంగామా సినిమా ద్వారా వేణుమాధవ్ హీరోగా కూడా మారారు. దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 600 సినిమాల్లో వేణుమాధవ్ నటించారు. ఆయన చివరిగా  రుద్రమదేవి సినిమాలో నటించారు. ఆరోగ్య సమస్య తలెత్తడంగో ఆయన సినిమాల నుండి తప్పుకున్నారు.

venu madhav death

- Advertisement -