సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన యుద్ధ నేపథ్య చిత్రం ‘బోర్డర్ 2’ రోజురోజుకీ భారీ హిట్గా మారుతోంది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజే రూ.32 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, రెండో రోజు రూ.40.59 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది.
ఆదివారం ఈ సినిమా మరింత జోరు చూపించింది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన రోజుగా ఆదివారం నిలిచింది. ఒక్క ఆదివారమే రూ.57.20 కోట్ల నెట్ వసూలు చేయడం విశేషం. దీంతో మొత్తం కలెక్షన్లు రూ.129.89 కోట్ల నెట్కు పైగా చేరాయి.
ఆదివారం మరియు గణతంత్ర దినోత్సవ సెలవులు సినిమాకు బాగా కలిసి వచ్చాయి. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల నెట్ మార్క్ను ‘బోర్డర్ 2’ దాటడం గమనార్హం. నాలుగో రోజూ కూడా సినిమా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తర్వాతి రోజుల్లో సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సన్నీ డియోల్తో పాటు వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంఝ్, అహాన్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా తమ తమ బ్యానర్లపై నిర్మించారు.
Also Read:Modi:వికసిత్ భారత్ దిశగా అడుగులు

