బర్త్ డే..మొక్కలు నాటిన బొంతు రామ్మోహన్

59
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఈరోజు తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్.

ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి తనను మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ గొప్ప కార్యక్రమం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తు పాల్గొన్నారు.

- Advertisement -