టాలీవుడ్ స్టార్స్ తో బాలీవుడ్ డైరెక్టర్స్!

11
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్ హీరోస్ క్రేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ప్రభాస్ బాహుబలితో, అల్లు అర్జున్ పుష్ప మూవీతో, ఎన్టీఆర్ రాంచరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో.. నేషనల్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ హీరోస్ కూడా సాధ్యం కానీ రికార్డ్స్ ను కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఈ హీరోలను డైరెక్ట్ చేసేందుకు బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం క్యూ కడుతున్నారు. ప్రభాస్ తో సినిమా చేసేందుకు పలువురు బాలీవుడ్ డైరెక్టర్స్ ఇప్పటికే కథలు కూడా రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ సైతం ఆల్రెడీ ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో మూవీకి కమిటైన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వార్ సీక్వల్ మూవీలో విలన్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. .

ఇక రామ్ చరణ్ సైతం ఓ బాలీవుడ్ డైరెక్టర్ తో మూవీ చేసే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గేమ్ చేంజర్, RC16 చేస్తున్న చరణ్ ఆ మూవీస్ తరువాత సంజయ్ లీలా బన్సాలి డైరెక్షన్ లో మూవీ చేయనున్నట్లు సమాచారం. చరణ్ కోసం బన్సాలి ఓ పిరియాడిక్ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తో కూడా బాలీవుడ్ డైరెక్టర్స్ స్టోరీలు వినిపించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇక వీరితో విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్దార్థ్ వంటి హీరోల డేట్స్ కోసం కూడా బాలీవుడ్ డైరెక్టర్స్ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బాలీవుడ్ దర్శక నిర్మాతలంతా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్ లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ హీరోస్ హంగామానే ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.

Also Read:లోకేష్ పై హేళన, జూ.ఎన్టీఆర్ పై గౌరవం

- Advertisement -