బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ మూవీ..!

514
prabhas
- Advertisement -

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం జాన్‌. గోపికృష్ణా మూవీస్ బ్యానర్ లో సీనియర్ నటుడు, నిర్మాత కృష్ణంరాజు సమర్పణలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా త్రిభాషా చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్న సంగతి తెలిసిందే. జిల్ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ అందించిన కే కే రాధాకృష్ణ దర్శకుడు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు ప్రభాస్. జాన్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయనుండగా ఈ మూవీ పూర్తయిన తర్వాత మరో రెండు సినిమాలు చేయనున్నాడు. తన సొంత సంస్థ లాంటి యువీ క్రియేషన్స్‌లోనే ఓ సినిమాని చేయబోతున్నట్లు సమాచారం.

ఆ మేరకు ఇప్పటికే ఒప్పదం కుదిరిందని సమాచారం. ఆ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా కరోనా తర్వాత వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు ప్రభాస్.

- Advertisement -