ప్రతి గింజను కొనుగోలు చేయాలిః ఎమ్మెల్యే షకీల్

431
Bodhan mla Shakil
- Advertisement -

రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నారు నిజామాబాద్ జిల్లా  బోధన్ ఎమ్మెల్యే షకీల్. బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సమావేశం ఇవాళ జరిగింది. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే షకీల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. .మార్కెట్ కమిటీ చైర్మన్ గా వాగ్మరే అర్చన, వైస్ చైర్మన్గా షేక్ లతీఫ్ లు ప్రమాణం చేశారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ..మార్కెట్ కమిటీ పాలకవర్గం చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలి. అలాగే మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. ప్రతిక్షణం రైతులకు అందుబాటులో ఉండి రైతుల అభ్యున్నతికి పాటు పడాలి.గతంలో ఏ ప్రభుత్వాలు ఆరు తడి పంటలను రైతుల వద్ద కొనలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతులు పండించి ప్రతి గింజ కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటున్నట్లు తెలిపారు.

- Advertisement -