పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తా:బీఎల్‌ఆర్‌

534
blr
- Advertisement -

పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తానని తెలిపారు బండారు లక్ష్మారెడ్డి. బీఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత ఆగస్టు నెలలో తహసిల్దార్,వీఆర్వో,కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ తరగతులలో శిక్షణ పొందిన సుమారు పదిమంది విద్యార్థులు కానిస్టేబుల్ ఉద్యోగాలలో విజయం సాధించారు.

కానిస్టేబుల్ ఉద్యోగం లో విజయం సాధించిన చక్రిపురం కు చెందిన డి. ఆంజనేయులు, ఏం. ఆల్లూరి రావు, డి నరేందర్ శ్రీనివాస్ లు బండారి లక్ష్మా రెడ్డిని సైనిక్‌పురి ఆఫీస్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు.

భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు బాసటగా నిలుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయిజెన్ శేఖర్, కటార్ల భాస్కర్, మహేష్ గౌడ్, ఇంద్రయ్య ,నవీన్ గౌడ్, గోలి శ్రీనివాస్,బాలకృష్ణ ,వినయ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -