రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సినీ ఆర్టిస్ట్ లోరా ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి నేడు మాదాపూర్ కాకతీయ పార్క్లో మొక్కలు నాటారు సినీ ఆర్టిస్ట్ బ్లాక్ స్టార్ షాని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చాలా గోప్ప కార్యక్రమం చేపట్టారు. మొక్కల వల్ల ఎంతో ఉపోయోగలు ఉన్నాయి. చాలా వర్షాలు పడుతాయి మొక్కలు నాటించడం చాలా సంతోషంగా ఉంది అందుకు సంతోష్ కి మనసుపూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.
మరో ముగ్గురికి నేను ఛాలెంజ్ విసురుతున్నాను ( యాక్టర్ట్ అబినో షార్థర్.. ఆర్టిస్ట్ శ్రీధర్… ఆర్టిస్ట్ లోహిత్ కుమార్ )లను మొక్కలు నాటాలని షాని కోరారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కోటివృక్షార్చన కార్యక్రమంలో అందరూ పాల్గొని మొక్కలు నాటి విజయవంతం చేయాలని బ్లాక్ స్టార్ షాని కోరారు.