- Advertisement -
హుజురాబాద్లో బీజేపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ పార్టీ విభజన రాజకీయాలను దేశ వ్యాప్తంగా ప్రజలంతా చాలా దగ్గరి నుంచి గమనిస్తున్నారని పేర్కొన్నారు. దేశం లోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను వేధింపులకు గురిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.
వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లోనూ బీజేపీ పార్టీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు ఓవైసీ. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మొత్తం 100 స్థానాల్లో పోటీ… చేయనుందని.. ఓవైసీ తెలిపారు. యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు.
- Advertisement -