దత్తాత్రేయ ఇంట విషాదం..

281
- Advertisement -

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో మరణించాడు. మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. వైష్ణవ్ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్థారించారు.

BJP MP Bandaru Dattatreya’s Son Dies of Heart Attack at 21

21ఏళ్ల చిన్న వయసులో గుండెపోటుతో వైష్ణవ్ మరణించడం అందర్నీ కలిచివేస్తోంది. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరివాడు అనిపించుకున్న దత్తాత్రేయకు తీరని లోటు ఇది. అతడ్ని ఓదార్చడం ఎవ్వరితరం కావట్లేదు. కొడుకును మీడియాకు దూరంగా ఉంచి, సంప్రదాయబద్ధంగా పెంచారు దత్తాత్రేయ. తన రాజకీయ ప్రభావం కుమారుడిపై పడకూడదనే ఉద్దేశంతో కేవలం చదువుకే పరిమితం చేశారు. వైష్ణవ్ అంటే దత్తాత్రేయకు చాలా ఇష్టం.

- Advertisement -