- Advertisement -
బీజేపీ నేతలపై మరోసారి సంచలన కామెంట్ చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. తనను జైలుకు పంపడానికి పార్టీలోనే తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కొంతమంది తనను వెన్నుపోటు పొడిచేందుకు చూస్తున్నారని అన్నారు.
గత ప్రభుత్వం తనపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపడం వెనక బీజేపీలోని కొందరు నేతల హస్తం ఉందని… ఈ విషయం తనతో ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారని తెలిపారు. ఈ విషయం తెలిశాక బాధ కలిగిందని చెప్పారు.
పోలీసులు అధికారంలో ఉన్న వారి మాట వింటారని, అయితే న్యాయపరంగానే పనిచేస్తారని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రాజా సింగ్ దూరంగా ఉన్నారు రాజాసింగ్.
Also Read:పెద్దన్న లెక్క భట్టిని గౌరవిస్తా: కేటీఆర్
- Advertisement -