ప్ర‌ధాని మోదీ దుర్మార్గుడుః బీజేపీ నాయ‌కురాలు మాధ‌వి ల‌త

426
madhavi latha modi
- Advertisement -

ప్ర‌ధాని మోదీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది సినీ న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వి ల‌త‌. మోదీ ఒక దుర్మార్గుడ‌ని .. ఆయ‌న నిజ‌స్వ‌రూపం తెలుసుకునేందుకే తాను బీజేపీలో చేరాన‌ని చెప్పింది. మోదీపై విమ‌ర్శ‌లు చేస్తూ ఆమె త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. “నేను బీజేపీ లో జాయిన్ అయ్యిందే అసలు దేశానికి బీజేపీ నిజంగా సహాయం చేస్తుందా? నాశనం చేస్తుందా? అని తెలుసు కోవడానికి ట్రూగా మోదీ దుర్మార్గుడు. రోజు అయన ఏమి చేసాడో చెప్తా వినండి. ఎపుడో చిన్నపుడు స్కూల్ లో జాతీయగీతం పాడాను. మర్చిపోయి చాల ఇయర్స్ అయింది.

madhavi latha bjp

ఎవడికి కావాలి తొక్కలో గీతం. మీటింగ్స్ పెట్టిన అదే… ఏం జరిగినా అదే… ఆఖరికి ఎంజాయ్ చేద్దామని మూవీకి పోతే జాతీయగీతమా. ఏమయ్యా మోదీ… మాకు అవసరమా? మజా చేసద్దామని సినిమాకి పోతే దేశభక్తి ఏంటి? మాకు ఛీ… పని పాట లేని పనులు మీరు. మాకొద్దు ఇలాంటివి. మెం పక్కా లోకల్. పక్కా లోకల్… అలంటి పాట పడుకుంటాం. కిక్ వస్తది. అయ్యా మోడీ నీకు దేశభక్తి ఉంటె నువ్ పాడుకో. మాకెందుకు రుద్దడం నీవల్ల దేశానికి ఎం ఉపయోగం? అని పోస్ట్ చేసింది. కొద్ది రోజుల క్రీతం ఆమె కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్కరీ స‌మ‌క్షంలో బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధానిపై మాధ‌వి ల‌త‌ ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డంపై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

- Advertisement -