సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న బీజేపీ నేతలు..

52
medaram
- Advertisement -

మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. సమ్మక్క-సారక్క అమ్మవార్లను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణకే తలమానికమైన సమ్మక్క-సారక్క జాతర చరిత్రలో మిగిలిపోతుందని చెప్పారు.

సమ్మక్క-సారక్కలు గద్దెలపై కొలువుదీరి భక్తకోటికి కన్నుల పండువగా దర్శనమిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం అమ్మవార్ల దర్శనార్థం భారీగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవార్ల దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసింది.

- Advertisement -