టీఆర్ఎస్‌లోకి బీజేపీ నేత కొత్త శ్రీనివాస్ రెడ్డి..

315
ktr karimnagar
- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టీఆర్ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతునే ఉన్నాయి. కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు,కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. అయితే తాజాగా బీజేపీకి గట్టిషాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం కేసీఆర్ పాల‌న‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితుడినై ఈ పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు శ్రీనివాస్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీలు వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.

మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ బీజేపీ తెలంగాణ చీఫ్ కె.లక్ష్మణ్‌కు లేఖ రాశారు. బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం తనపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

- Advertisement -