మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ కన్నుమూత..

9
- Advertisement -

మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఇవాళ ఉదయం ఉట్నూర్‌లోని తన నివాసంలో అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించగా మార్గం మధ్యలో ఆయన మృతి చెందారు.

1999లో ఖానాపూర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2006-2009 లో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2009లో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే సమయంలో ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో మరోసారి ఖానాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం బీజేపీలో చేరారు.

Also Read:అంజన్న సన్నిధిలో పవన్..

- Advertisement -