బీజేపీ అంటేనే బీసీల పార్టీ!

2
- Advertisement -

నమ్మక ద్రోహాం నయవంచనకు – పోరాటాలకు, ధర్మ రక్షణకు మధ్య ఎమ్మెల్సి ఎన్నికలు జరగబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నయవంచన, నమ్మక ద్రోహానికి తగిన గుణపాఠం చెప్పాలని గ్రాడ్యుయేట్, టీచర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులు గెలిచిన వారం రోజుల్లోనే దీక్షలు, ఉద్యమాలతో కాంగ్రెస్ సర్కార్ పై యుద్దం ఆరంభిస్తామని ప్రకటించారు.

తనకు కేంద్ర మంత్రి పదవి ముఖ్యాం కానేకాదని, ప్రజలే తనకు ముఖ్యమని చెప్పారు. మంత్రిగా ఉంటూ గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన హైదరాబాద్ లో ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బీసీలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీ…ఇయాళ బీసీ జపం చేయడం సిగ్గు చేటన్నారు.

భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏ అభ్యర్ధిని నిలబెట్టినా గెలిపించే బాధ్యత మాదేనని నిరూపిస్తూ ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసిన కార్యకర్తలకు అభినందనలు…ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రావడం తథ్యం. ప్రజలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. టీచర్, గ్రాడ్యూయేట్ ఓటర్ల ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేసేలా కష్టపడాలి. ఎందుకంటే ఓటు అడిగే అర్హత బీజేపీకి మాత్రమే ఉంది. బీజేపీ గెలుపును కూడా ఎవ్వరూ ఆపలేరు. అన్ని సర్వేల్లోనూ అంజిరెడ్డి ముందస్తులో ఉన్నారు. రెండో స్థానం కోసమే కాంగ్రెస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఇప్పుడు బీసీ జపం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే నవ్వొస్తుంది. భారతీయ జనతా పార్టీ అంటేనే బీసీల పార్టీ. ప్రధానమంత్రి బీసీ వ్యక్తి. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీనే సీఎంను చేస్తామని గత ఎన్నికల్లో అధికారికంగా ప్రకటించినం. కానీ కాంగ్రెస్ లో సీఎం ఎవరు? బీసీ జాబితాలో ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేస్తోందెవరు? బీసీలకు అన్యాయం జరిగితే నోరు మెదపనోరు బీసీ బీసీ అని జపం చేస్తుంటే మోసపోదామా? ఇతరులు ఎవరు గెలిచినా ఎన్నికల తరువాత వాళ్లంతా కాంగ్రెస్ లో చేరతారు. నిఖార్సుగా నిజాయితీగా నిలబడి మీ పక్షాన పోరాడేది బీజేపీ మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు.

Also Read:మహాశివరాత్రి … ప్రత్యేక బస్సులు

బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేక పోటీ నుండి తప్పుకుంది. కాంగ్రెస్ కూడా అభ్యర్థులు దొరకక బయటి వాళ్లను అరువు తెచ్చుకుంది. మాజీమంత్రి జీవన్ రెడ్డి పోటీ చేయబోనని తప్పుకోవడమే ఆ పార్టీపట్ల వ్యతిరేకతకు నిదర్శనం. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఓటుకు రూ.7 నుండి రూ.10 వేలు పంచుతున్నారు. అయినా బాధపడాల్సిన పనిలేదు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పైసలు పంచినా… 2 లక్షల 25 వేల ఓట్లకుపైగా మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించారు. మేధావులు డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తులు రారు. తగిన గుణపాఠం చెబుతారు అన్నారు.

- Advertisement -