ఎన్నికలు జరిగే రాష్ట్రాల బీజేపీ ఇంచార్జీలు వీరే..

130
bjp
- Advertisement -

త్వరలో ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల ఇంచార్జీలను ప్రకటించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. అసోం రాష్ట్ర ఎన్నికల ఇంచార్జిగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌, డాక్టర్ జితేంద్ర సింగ్‌ను అసోం కో ఇంచార్జిగా నియమించారు.

తమిళనాడు ఎన్నికల బాధ్యతలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెరెడ్డికి అప్పగించగా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్‌ను తమిళనాడు కో ఇంచార్జిగా చేశారు. కేరళ ఎన్నికల బాధ్యతను ప్రహ్లాద్ జోషికి, కర్ణాటక డిప్యూటీ సీఎం డాక్టర్ అశ్వత్ నారాయణ్‌కు కో ఇంచార్జి బాధ్యతను అప్పగించారు. పుదుచ్చేరి ఎన్నికల ఇంచార్జిగా అర్జున్ రామ్ మేఘవాల్‌ను, జాతీయ ప్రతినిధి రాజీవ్ చంద్రశేఖర్‌ను కో ఇంచార్జిగా నియమించారు.

పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది బీజేపీ.

- Advertisement -