కరోనా వచ్చిన వారు దేశద్రోహులు కాదు: బిత్తిరి సత్తి

163
bithiri sathi
- Advertisement -

నటుడు,కమెడీయన్ బిత్తిరి సత్తి కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లైవ్ ద్వారా తనకు కరోనా వచ్చిన విషయాన్ని ధృవీకరించిన సత్తి…ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వెల్లడించారు.

తనకు కరోనా వచ్చిందని డాక్టర్ల సూచనలు పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. మంచి ఆహారం తీసుకుంటూ, క‌షాయం, ఆవిరి ప‌డుతూ ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపాడు. క‌రోనా వ‌చ్చిన విష‌యాన్ని దాచిపెట్ట‌డం చాలా త‌ప్పు. దాని వ‌ల‌న ఇత‌రులు ఇబ్బంది ప‌డ‌తారని తెలిపిన సత్తి… క‌రోనా వ‌చ్చిన వారిని దేశ‌ద్రోహుల్లా చూడొద్దు. వారికి కొండంత ధైర్యం అందించాలన్నాడు.

- Advertisement -