నేటి నుండి బయో ఏషియా సదస్సు..

148
ktr
- Advertisement -

నేటి నుండి హైదరాబాద్ వేదికగా బయో ఏషియా సదస్సు- 2022 జరగనుంది. వర్చువల్‌ పద్ధతిలో రెండు రోజులపాటు ఆసియాలో అతిపెద్ద లైఫ్‌-సైన్సెస్‌, హెల్త్‌కేర్‌ ఫోరం అయిన బయో ఏషియా సదస్సును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

తొలిరోజు సాంకేతికత ద్వారా ఆరోగ్య పరిశ్రమలను బలోపేతం చేయడం, కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి, హెల్త్‌కేర్‌ డెలివరీ సిస్టమ్‌ను క్రమబద్ధీకరించడం వంటి అంశాలపై చర్చజరగనుంది.

రెండో రోజైన శుక్రవారం.. ఫార్మా రంగం వృద్ధి, ఆ రంగం నుంచి అవకాశాలపై చర్చ జరుగనుంది. ఇందులో బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరిస్, జైడస్ క్యాడిలా, సీరమ్స్ భాగం కానున్నాయి. ఈ సదస్సులో బిల్‌గేట్స్‌, డబ్ల్యూహెచ్‌ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌, నీటి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సహా వివిధ సంస్థలకు చెందిన దాదాపు 50 మంది ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు.

- Advertisement -