Bigg Boss 8 Telugu : మళ్లీ నిఖిల్‌తో కలిసిపోయిన సోనియా

4
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా 11 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నిఖిల్‌తో కలిసిపోయింది సోనియా. నిన్నటి ఎపిసోడ్‌లో నిఖిల్‌ని టార్గెట్ చేసిన సోనియా తాజా ఎపిసోడ్‌లో చేయి పట్టేసుకుంది.

అనంతరం టాస్క్‌లు ఇచ్చారు. మీకు లెక్కలేనంత డబ్బు ఇచ్చేందుకు బిగ్‌బాస్ అవకాశాలు ఇస్తున్నాడు.. సమయానుసారం బిగ్‌బాస్ ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఎక్కువ మొత్తాన్ని సంపాదించిన టీమ్ దగ్గర ఉన్న డబ్బు మాత్రమే విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అని చెప్పాడు బిగ్ బాస్. తొలి అవకాశంగా రూ.28 వేలు అనౌన్స్ చేశాడు. టీవీలో తమ పేర్లు డిస్‌ప్లే అయిన కంటెస్టెంట్లు వెంటనే స్విమ్మింగ్‌పూల్‌లో దూకేయాలి. ఎవరు మొదటిగా దూకితే ఆ టీమ్‌కి రూ.25 వేల ప్రైజ్ మనీ వస్తుందని చెప్పాడు. ఈ టాస్క్‌లో విష్ణుప్రియ విజేతగా నిలిచింది.

రెండవ అవకాశం విలువ రూ.50 వేలు అంటూ రోప్ టాస్కు ఇచ్చాడు . ఈ టాస్కుకి పృథ్వీ, నబీల్, నిఖిల్‌లను ప్లేయర్లుగాసెలక్ట్ చేశాయగా అభయ్ సంచాలక్‌గా ఉన్నాడు. ముగ్గురు ప్లేయర్లు ఒక రోప్‌ను పట్టుకొని తమకిచ్చిన బాల్స్‌ను ఒక బాస్కెట్‌లో వేయాలి. ఎవరైతే ముందుగా అన్ని బాల్స్ వేస్తారో వాళ్లు విన్నర్. ఈ గేమ్‌లో నిఖిల్ గెలిచాడు.

మూడో అవకాశం విలువ 70 వేలు అంటూ స్పెల్లింగ్ టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. దీని ప్రకారం బిగ్‌బాస్ కొన్ని పదాలు చెబుతాడు వాటికి ఎవరైతే కరెక్ట్ స్పెల్లింగ్ రాస్తారో వాళ్లు విన్నర్. ఈ గేమ్‌లో మణికంఠ, యష్మీ, నైనిక పాల్గొనగా మణికంఠ గెలిచాడు. నాలుగో అవకాశం విలువ రూ.లక్ష 50 వేలు అంటూ బిగ్‌బాస్ అందరికీ షాకిచ్చాడు. ఓ గ్లాసులో ముగ్గురు కంటెస్టెంట్లు పల్పీ ఆరెంజ్ బాటిల్‌ను పోస్తారు. ఎవరు పోసేటప్పుడు ఆ గ్లాసు నుంచి లిక్విడ్ బయటికి వస్తుందో వాళ్లు ఔట్. ఈ టాస్కులో నిఖిల్, అభయ్, ఆదిత్య ఓం పాల్గొనగా నిఖిల్, అభయ్ ఇద్దరికీ టై కావడంతో చెరో రూ. 75 వేలు పంచాడు బిగ్‌బాస్.

తర్వాత ఐదవ అవకాశం విలువ రూ.50 వేలు అంటూ వ్యాక్స్ (హెయిర్ తీసుకోవడం) చేసుకోవాలని టాస్కు ఇచ్చాడు. ఈ టాస్కులో నిఖిల్, నబీల్, పృథ్వీ.. ముగ్గురూ పోటీపడగా ఛాతీ, మోకాలి కింది భాగంలో ఎవరైనా ముందుగా వ్యాక్స్ చేసుకుంటారో వాళ్లు విన్. ఈ టాస్క్‌లో నబీల్ విజేతగా నిలిచాడు. ఆరవ అవకాశం విలువ రూ. లక్ష అంటూ సాక్స్ టాస్క్ ఇచ్చాడు. తమ కాలుకి వేసుకున్న సాక్స్‌ను ఎవరైతే చివరి వరకూ ఉంచుకుంటారో వాళ్లు విన్నర్. ఈ టాస్క్‌లో నిఖిల్ విజేతగా నిలిచాడు. మొత్తంగా నిఖిల్ టీమ్ దగ్గర అత్యధికంగా రూ.2 లక్షల 45 వేలు ప్రైజ్ మనీ ఉండగా తర్వాత యష్మీ టీమ్ దగ్గర రూ.లక్ష 25 వేలు , రూ. లక్ష గెలుచుకొని మూడో స్థానంలో నైనిక టీమ్ ఉంది.

Also Read:Bigg Boss 8 Telugu: నిఖిల్‌తో సోనియా బ్రేకప్, విష్ణు ప్రియ చీప్!

- Advertisement -