Bigg Boss 8 Telugu: నిఖిల్‌తో సోనియా బ్రేకప్, విష్ణు ప్రియ చీప్!

3
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా రెండో వారం కొనసాగుతోంది. ఈ వారం నామినేషన్‌లో ఎనమిది మంది ఉండగా నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగిన సంగతి తెలిసిందే. ఇక తాజా ఎపిసోడ్‌లో ఇంట్లోని మూడు టీంలకు వాళ్లు ఎంపిక చేసిన రేషన్ గెలుచుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్‌ల్లో యష్మీ, నైనిక టీంలు విజేతగా నిలిచి రేషన్‌ గెలచుకున్నారు. ఓడిపోయిన నిఖిల్ టీమ్‌కి రాగి పిండి మాత్రమే మిగిలింది.

తొలుత హౌస్‌లో ఎక్కుమంది సభ్యులున్న యష్మీ టీమ్ కి ఎక్కువ టైం ఇచ్చారు బిగ్ బాస్. ముందుగా లెమన్ పిజ్జా ఇవ్వగా ఇందులో గెలిచి రేషన్ దక్కించుకుంది యష్మీ టీమ్. తర్వాత పెట్టిన ‘కనిపెట్టు పరిగెత్తు’ టాస్కులో నైనిక టీమ్ గెలవగా వారికి రేషన్ దక్కింది. నిఖిల్‌ టీమ్‌ రెండు టాస్క్‌ల్లోనూ ఓడిపోవడం విశేషం.

తన టీమ్ రేషన్ గెలుచుకున్న కంటతడి పెట్టేసింది సోనియా. వెంటనే నిఖిల్ పరుగెత్తుకు రాగా ఏం లేదని పంపేశాడు అభయ్. అయితే ఆ నిఖిల్ కూడా కాసేపు ఓదార్చాడు. కలిసి ఫుడ్ షేర్ చేసుకున్నాం.. ఇప్పుడు వాళ్ల ముందే వాళ్లకి షేర్ చేయకుండా తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అని మొసలి కన్నీరు కార్చింది సోనియా. ఈ క్రమంలో నిఖిల్‌ చెప్పిన పాయింట్ నచ్చక హార్ట్ అయి అక్కడి నుండి వెళ్లిపోయింది సోనియా.

Also Read:Bigg Boss 8..Day 09: ఈ వారం నామినేషన్స్‌లో ఉంది వీరే!

ఆ తర్వాత ఉదయాన్నే ఈ సారి విజేత నేనే అంటూ సోనియా చెప్పింది. వెంటనే పృథ్వీ నాకు కూడా నేనే విన్నర్ అనిపిస్తుంది అంటూ సరదాగా అన్నాడు. ఆ తర్వాత నైనికతో తన గురించి చెబుతూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే సోనియా మాత్రం తన డబుల్ గేమ్ కంటిన్యూ చేస్తూనే ఉంది. అభయ్‌తో మాట్లాడుతూ వాడిని (నిఖిల్) చూస్తేనే కోపం వస్తుంది అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తమ రేషన్‌లో దక్కిన డ్రింక్ బాటిల్‌ను సరదాగా యష్మీ, ప్రేరణ ముందు తిరుగుతూ తాగింది విష్ణుప్రియ. సరదాగా వాళ్లని టీజ్ చేయగా రెచ్చగొట్టాలంటే విష్ణుప్రియ, ప్రేరణ తర్వాతే ఎవరైనా అని విష్ణుప్రియ మరి చీప్‌ అని కామెంట్ చేసింది సోనియా.

- Advertisement -